ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి పశ్చిమ బెంగాల్ తరచూ ఎందుకు వస్తున్నారని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అధీర్ చౌదరి ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీకి సరైన మద్దతు ఉంటే ఇన్నిసార్లు రావలసిన అవసరం లేదని పేర్కొన్నారు. మోడీ సిలిగురి పర్యటనకు ముందు తన లోక్సభ నియోజకవర్గం బెర్హంపూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో చౌదరి మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో బీజేపీ సరిగ్గా ఉంటే బెంగాల్లో ప్రధాని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆత్మనిర్భర్ నినాదాన్ని మోడీ నిజంగా విశ్వసిస్తే రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ, దాని భాగస్వాములు మధ్య ప్రాధమిక చర్చలు జరిగాయని చౌదరి అంగీకరించారు. సీట్ల పంపకానికి సంబంధించి విషయాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు, దీనికోసం ఎలాంటి హడావుడి లేదని చెబుతూ రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమైందని చౌదరి స్పష్టం చేశారు.
ఆత్మనిర్భర్ నినాదాన్ని మోడీ విశ్వసిస్తే బెంగాల్ రావాల్సిన అవసరంలేదు !
March 09, 2024
0
Tags