స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం !

Telugu Lo Computer
0


తెలంగాణ యువతలో స్కిల్ డెవలప్‌మెంట్‌ను పెంపొందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే ఐటీఐలను అధునాతన నైపుణ్య కేంద్రాలుగా మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది. టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ అకడమిక్ ఇయర్ నుంచే స్కిల్ సెంటర్ల ప్రారంభానికి సన్నాహాలు చేస్తుండగా.. 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులను అందుబాటులోకి తేనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఎంవోయూ ప్రకారం రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ అప్ గ్రేడ్ చేయనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)