లోక్‌సభ ఎన్నికల బరిలో యూసఫ్‌ పఠాన్‌ !

Telugu Lo Computer
0


టీమిండియా మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ రానున్న లోక్‌సభ​ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. పఠాన్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నాడు. వెస్ట్‌ బెంగాల్‌లోని బరంపూర్‌ నియోజకవర్గం నుంచి యూసఫ్‌ పఠాన్‌ను టీఎంసీ బరిలోకి దించింది. ఇవాళ ఉదయమే తృణమూల్‌ తీర్దం పుచ్చుకున్న పఠాన్‌... పార్టీలో చేరిన గంటలోపే ఎంపీ టికెట్‌ దక్కించుకోవడం ఆసక్తికరం. ప్రస్తుతం బరంపూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ లోక్‌సభ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరీ ఎంపీగా ఉన్నాడు. చౌదరీ గతంలో ఈ స్థానం నుంచి ఐదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇండియా కూటమి​ పొత్తులో భాగంగా బరంపూర్‌ స్థానాన్ని టీఎంసీ కాంగ్రెస్‌కు వదిలి పెడుతుందని అంతా అనుకున్నారు. అయితే కాంగ్రెస్‌కు షాక్‌ ఇస్తూ టీఎంసీ రాష్ట్రం మొత్తంలో అభ్యర్దులను నిలబెట్టింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)