విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఒకే కుటుంబంలో నలుగురు చిన్నారులు మృతి !

Telugu Lo Computer
0

త్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలోని పల్లవపురం ప్రాంతంలోని జనతా కాలనీలోని ఓ ఇంట్లో సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వేగంగా వ్యాపించి ఒకే కుటుంబంలోని నలుగురు పిల్లలు మృతి చెందగా, వారి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు గాయపడిన కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి నలుగురు పిల్లలు మరణించారు. వారిని సారిక (10), నిహారిక (8), సంస్కర్ అలియాస్ గోలు (6), కలు(4)గా గుర్తించారు. తల్లిదండ్రులు జానీ, బబితలకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో బబిత పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)