హైదరాబాద్ మినహా అన్ని పార్లమెంట్ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన !

Telugu Lo Computer
0


లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపుగుర్రాలను బరిలో దింపుతున్నారు. ఈ క్రమంలో శనివారం మరో రెండు పార్లమెంటు స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి క్యామ మల్లేశ్, నల్గొండ స్థానం నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. ఇప్పటివరకు హైదరాబాద్ మినహా అన్ని పార్లమెంట్ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత, కరీంనగర్ - బోయినిపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి(ఎస్సీ) -కొప్పుల ఈశ్వర్, మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ (ఎస్సీ)-డాక్టర్ కడియం కావ్య, నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్, జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్, ఆదిలాబాద్(ఎస్టీ) -ఆత్రం సక్కు, మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి, మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి, నాగర్ కర్నూల్ (ఎస్సీ)-ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్, సికింద్రాబాద్ - తీగుళ్ల పద్మారావు గౌడ్, నల్గొండ - కంచర్ల కృష్ణా రెడ్డి, భువనగిరి - క్యామ మల్లేష్. 

Post a Comment

0Comments

Post a Comment (0)