ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 361 పాయింట్లు కోల్పోయి 72,470కి పడిపోయింది. నిఫ్టీ 92 పాయింట్లు నష్టపోయి 22,004 వద్ద స్థిరపడింది. టెక్, ఐటీ సూచీలు ఎక్కువగా నష్టపోయాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.29గా ఉంది.
నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు !
March 26, 2024
0
Tags