సిద్దిపేట జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ఎదురు దెబ్బ !

Telugu Lo Computer
0


తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇలాకాలో బీఆర్ఎస్‌ కు ఎదురు దెబ్బ తగిలింది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఎంపీపీ  పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ప్రస్తుత ఎంపీపీ ర్యాగల సుగుణ దుర్గయ్యపై అవిశ్వాసం నెగ్గింది. దీంతో కొండపాక మండలానికి చెందిన మంచాల అనసూయ కనక రాములు ఎంపీపీగా ఎన్నిక అయ్యారు. ఆరుగురు బీఆర్ఎస్, ఇద్దరు కాంగ్రెస్, ఒక్క బీజేపీ  ఎంపీటీసీలు కలసి నూతనంగా ఎంపీపీగా కొండపాకకు చెందిన మంచాల అనసూయ కనక రాములును ఎన్నుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)