మహువా మొయిత్రాకు ఈడీ సమన్లు !

Telugu Lo Computer
0


తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 11న కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విచారణకు హాజరయ్యేందుకు కొన్ని వారాల సమయం మాజీ ఎంపీ కోరారని ఓ అధికారి పేర్కొన్నారు. గతంలో విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో తాను హాజరుకాలేనంటూ ఆమె లేఖ రాశారు. తాజాగా ఈ నెల 11న విచారణకు రావాలని సమన్లు జారీ చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ నిబంధనల ప్రకారం.. మాజీ ఎంపీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేయాలని ఈడీ భావిస్తున్నది. విదేశీ చెల్లింపులు, నిధుల బదిలీ, ఎఆర్‌ఈ ఖాతాలకు సంబంధించిన లావాదేవీలపై ఈడీ కన్నేసింది. మరో వైపు ఎంపీపై వచ్చిన ఆరోపణలను లోక్‌పాల్‌ సైతం విచారణ జరుపుతున్నది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ ఫెమాలో విచారణ జరుపుతున్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)