వార్ధా నదిలో నలుగురు యువకుల గల్లంతు

Telugu Lo Computer
0


తెలంగాణలోని కొమరంభీం జిల్లా కౌటాల మండలం తాటి పల్లి వార్ధా నదిలో స్నానానికి వెళ్లి యువకులు గల్లంతైన ఘటన తీరని విషాదాన్ని నింపింది. హోలీ వేడుకలు జరుపుకున్న యువకులు ఆనందంలో స్నానం కోసం వార్ధా నదికి వెళ్లారు. నీటిలో దిగిన  యువకుల జాడ తెలియరాలేదు. ఒడ్డున వున్న కొంత మంది గుర్తించి అక్కడే ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. నలుగురు గల్లంతు అయినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు. నలుగురు గల్లంతు అయిన యువకులు సంతోష్, ప్రవీణ్, కమలాకర్, సాయిగా గుర్తించారు. వీరు కౌటాల మండలం నదిమబాద్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గాలింపుల్లో ఇద్దరూ యువకుల మృతదేహాలు లభ్యం కాగా.. మరో ఇద్దరూ కోసం గాలింపు చేపడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)