కేజ్రీవాల్ అంటే ప్రధాని మోడీకి భయం !

Telugu Lo Computer
0


ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అంటే ప్రధాని మోడీకి భయం, కానీ ఇప్పుడు కేజ్రీవాల్ మరింత ప్రమాదకరంగా మారారని శివసేన (యుబిటి) ఎంపి సంజయ్ రౌత్ అన్నారు. అరెస్ట్ అనంతరం కేజ్రీవాల్ జైలు నుండి పాలన సాగించడంతో ఆయనను ఎదుర్కోవడం ప్రధాని మోడీకి ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారిందని అన్నారు. జైలు నుండి ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రజలు ఆయన మాట వింటారని, ఆయనకు పూర్తి మద్దతునిస్తారని అన్నారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో జైలుకు వెళ్లిన నేతలు మరింత బలంగా బయటకు వచ్చారని అన్నారు. మార్చి 31న ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో ఇండియా ఫోరం చేపట్టనున్న భారీ ర్యాలీలో తాను కూడా పాల్గొననున్నట్లు ప్రకటించారు. లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గతవారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇడి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు కోర్టు వారం రోజుల పాటు కస్టడీ విధించింది. దీంతో కేజ్రీవాల్ జైలు నుండే పాలన సాగిస్తున్నారు. ఢిల్లీలో నీటి సమస్యకు సంబంధించి ఆదివారం జైలు నుండి ఉత్తర్వులు జారీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)