బెంగుళూరులో షాపు ఓనర్‌పై దాడి : ముగ్గురి అరెస్టు

Telugu Lo Computer
0

బెంగుళూరులోని హలసూర్ గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న సిద్దన్నగల్లి వద్ద  ఓ షాపు ఓనర్‌పై దాడి చేసిన కేసులో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. అజా సమయంలో లౌడ్ మ్యూజిక్ ఎందుకు పెట్టావంటూ కొందరు యువకులు ఓ మొబైల్ షాపు ఓనర్‌తో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఓ వ్యక్తి షాపు ఓనర్ కాలర్  పట్టుకున్నాడు. దీంతో ఆ షాపు ఓనర్ అతనిపై దాడి చేశాడు. ఆ తర్వాత గుంపుగా ఉన్న వ్యక్తులుషాపు ఓనర్‌పై పిడిగుద్దులు విసిరారు. ఇదంతా ఆ షాపులో ఉన్న సీసీ కెమెరాకు రికార్డు అయ్యింది. షాపు ఓనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హలసూరు పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆరుగురు దాడి చేయగా దాంట్లో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)