ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్‌ జరిపిన వైమానిక దాడుల్లో 8 మంది చిన్నారుల మృతి !

Telugu Lo Computer
0


ఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్‌ సైన్యం సోమవారం తెల్లవారుజామున జరిపిన వైమానిక దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో అందరూ మహిళలు, చిన్న పిల్లలే. ఇవి బాధ్యత రహితమైన దాడులని ఆప్ఘనిస్తాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు తాలిబన్‌ ప్రభుత్వ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్‌ సరిహద్దులో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఖోస్ట్‌, పక్టికా ప్రావిన్సుల్లోని పౌరుల నివాసాలపై సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ వైమానిక దాడులు జరిగినట్లు తాలిబన్లు తెలిపారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇవి ఆఫ్ఘనిస్తాన్‌ సార్వభౌమాత్వాన్ని ఉల్లంఘించే దాడులని పేర్కొన్నారు. కాగా, ఆదివారం ఆఫ్ఘన్‌ సరిహద్దు వెంబడి పాక్‌ భూభాగంలోనే పాకిస్తాన్‌ సైన్యంపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్‌ సైనికులు పలువురు చనిపోయారు. వీటికి ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్‌ అధ్యకక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆఫ్ఘనిస్తాన్‌పై వైమానిక దాడులు జరగడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)