కర్ణాటకలో జేడీఎస్ అభ్యర్థుల ప్రకటన !

Telugu Lo Computer
0


ర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే జేడీఎస్ జాబితాలో కుమారస్వామి ప్రకటించారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత జాతీయ రాజకీయాల్లోకి కుమారస్వామిఎంట్రీ ఇస్తున్నారు. మాండ్య నుంచి కుమారస్వామి పోటీ చేస్తున్నారు. మాండ్యతో పాటు హాసన్, కోలార్ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను వెల్లడించింది. హాసన్‌ నుంచి ప్రస్తుత ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ, కోలార్‌ నియోజకవర్గం నుంచి ఎం. మల్లేష్‌ బాబు బరిలో నిలిచారు. కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ మధ్య పొత్తు కుదిరింది. లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జేడీఎస్ మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. దీంతో శుక్రవారం జేడీఎస్ అధిష్టానం అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. కుమారస్వామి ప్రస్తుతం చన్నపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి ఆయన పార్లమెంట్‌కు వెళ్లాలని భావించారు. దీంతో మాండ్య నుంచి కుమారస్వామి బరిలోకి దిగుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)