తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు 30వ తేదీ నుంచి సెలవులు !

Telugu Lo Computer
0


తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మార్చి 30వ తేదీ నుంచి అన్ని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ఇంటర్ బోర్డ్ ప్రకటన ప్రకారం.. మార్చి 30వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయి. మళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచుకుంటాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ ఇంటర్ కాలేజీలకు ఈ సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఇంటర్ బోర్డు ఆదేశాలను పాటించకుండా.. ఏ కాలేజీ అయినా విద్యార్థులకు క్లాస్‌లు నిర్వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. వచ్చే విద్యా సంవత్సరానికి ఇంటర్ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది ఇంటర్ బోర్డు. అడ్మిషన్ల కోసం తేదీలను ప్రకటించినప్పుడే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని స్పస్టం చేసింది ఇంటర్ బోర్డు.

Post a Comment

0Comments

Post a Comment (0)