లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను భాజపా విడుదల చేసింది. మొత్తం 195 స్థానాలకుగానూ పోటీదారుల పేర్లను పార్టీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే ప్రకటించారు. ఈ లిస్ట్లో మొత్తం 34 మంది మంత్రులున్నారు. 57 మంది ఓబీసీలకు హైకమాండ్ అవకాశమిచ్చింది. యువతకు 47 స్థానాలు కేటాయించినట్టు వినోద్ తావడే వెల్లడించారు. ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 సీట్లు కేటాయించారు. మొత్తం అభ్యర్థుల్లో 28 మంది మహిళలకు అవకాశమిచ్చారు. బెంగాల్లో 20, మధ్యప్రదేశ్లో 24, గుజరాత్లో 15, రాజస్థాన్లో 15 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కేరళ 12 సీట్లు, తెలంగాణ 9 సీట్లు, అసోం 11, ఝార్ఖండ్ 11, ఛత్తీస్ గఢ్ 11, ఢిల్లీ 5 సీట్లు, జమ్మూ కశ్మీర్ 2, ఉత్తరాఖండ్, 2, అరుణాచల్ ప్రదేశ్, గోవా 1, త్రిపుర 1, అండమాన్ నికోబార్ 1, డామన్ డయ్యూ 1 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. లిస్ట్లో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా మరి కొందరు కీలక నేతల పేర్లున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వారణాసి నుంచే బరిలోకి దిగనున్నారు. ఎప్పటిలాగే అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ నుంచి పోటీ చేయనున్నారు. దాదాపు 15 రోజులుగా ఈ జాబితాపై మేధోమథనం చేస్తోంది అధిష్ఠానం. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జాబితాని పూర్తిగా పరిశీలించి ఆ తరువాత ఆమోద ముద్ర వేశారు.
195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల !
March 02, 2024
0
Tags