ఇండోనేషియాలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు క్రీడాకారుడు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఆటగాడు మైదానంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా అతడిపై మెరుపు పడింది. దీంతో మైదానంలో కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన చూసిన సహచర ఆటగాళ్లు షాక్ కు గురయ్యారు. స్థానిక మీడియా కథనం ప్రకారం ప్లేయర్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అతను అప్పటికే చనిపోయాయడు. పిడుగుపాటు కారణంగా ఫుట్బాల్ ప్లేయర్ ఇలా మరణించడం సహచరులను తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
ఫుట్బాల్ మైదానంలో పిడుగుపడి క్రీడాకారుడు మృతి
February 12, 2024
0
Tags