ఆంధ్రప్రదేశ్ కి రాజధాన ఏదీ అంటే ప్రస్తుతానికి అమరావతేనని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అయితే తమ నినాదం, విధానం మాత్రం మూడు రాజధానులేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన మంత్రి అంబటి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తమ పాలనపై నమ్మకంతోనే ఎన్నికలకు వెళ్తున్నామని తెలిపారు. తాము ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశామన్నారు. కానీ టీడీపీ, జనసేన పార్టీలకు పొత్తులపై ఇప్పటికీ క్లారిటీ రాలేదని విమర్శించారు.
ఏపీకి ప్రస్తుతానికి రాజధాని అమరావతే !
February 12, 2024
0
Tags