డ్రగ్స్ పార్టీలో దర్శకుడు క్రిష్ !

Telugu Lo Computer
0


రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ కేసులో డైరెక్టర్‌ క్రిష్‌ డ్రగ్స్‌ పార్టీలో ఉన్నట్టు పోలీసులు తేల్చారు. పెడ్లర్‌ అబ్బాస్ స్టేట్‌మెంట్‌లో క్రిష్‌ పేరు ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. పార్టీ జరిగే సమయంలో వివేకానందతోపాటు రాడిసన్‌ హోటల్‌లో డైరెక్టర్‌ క్రిష్‌ ఉన్నట్లు తెలిపారు. గజ్జెల వివేక్‌ నిర్వహించిన పలు పార్టీలకు క్రిష్‌ హాజరైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది పోలీసులు కన్ఫామ్ చేయాల్సి ఉంది. మరికొందరు సినీ సెలబ్రిటీల పాత్రపైనా ఆరా తీస్తున్నారు. తీగ లాగితే కొకైన్‌ డొంక కదులుతోంది.  గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎఫ్‌ఐఆర్‌లో ఇప్పటిదాకా 10మంది పేర్లు చేర్చారు పోలీసులు. ఫ్రెండ్స్‌తో డ్రగ్స్‌ పార్టీ చేసుకున్నానంటూ పట్టుబడ్డ వివేకానంద అంగీకరించారు. నిర్భయ్‌, రఘుచరణ్‌, కేదార్‌, సందీప్‌, శ్వేత, లిశి, నీల్, క్రిష్‌లతో కలిసి వివేకానంద డ్రగ్స్ పార్టీ చేసుకున్నాడు. సయ్యద్ అబ్బాస్‌ జఫ్రీ దగ్గర డ్రగ్స్‌ కొనుగోలు చేశామని పోలీస్‌ విచారణలో వివేకానంద చెప్పినట్లు సమాచారం. డ్రగ్స్‌ కేసులో పరారీలో ఉన్న ఏడుగురు నిందితుల కోసం పోలీసులు వేటాడుతున్నారు. హోటల్ సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. నిందితులు కొకైన్ ని పేపర్ రోల్ లో చుట్టి సేవించినట్లు పోలీసులు గుర్తించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)