హైదరాబాద్‌ను లైఫ్ సైన్సెస్‌కు రాజధానిగా చేస్తాం !

Telugu Lo Computer
0


హైదరాబాద్ వేదికగా నిర్వహించిన బయో ఏషియా సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు చోట్ల ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలో జీనోమ్ వ్యాలీ ఫేజ్-2ని కూడా ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. ఇప్పటికే దావోస్‌ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో పాల్గొని రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్‌ను లైఫ్ సైన్సెస్‌కు రాజధానిగా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా 1/3 వంతు ఫార్మా ఉత్పత్తులను ప్రపంచానికి సరఫరా చేయడం సంతోషదాయమని రేవంత్ రెడ్డి అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)