తెలంగాణలో మరో 74 మంది మున్సిపల్‌ కమిషనర్‌లు బదిలీ

Telugu Lo Computer
0


పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మంగళవారం 40 మంది మున్సిపల్‌ కమిషనర్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభత్వ  బుధవారం మరో 74 మంది మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర పురుపాలక శాఖ ఈ బదిలీలు చేపట్టింది. తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖలో కూడా ప్రభుత్వం భారీగా బదిలీలు చేసింది. గ్రామీణాభివృద్ధి శాఖలో 105 మందిని బదిలీ చేసింది. సీఈవో, డీఆర్డీవో, అడిషనల్‌ డీఆర్డీవో, డీపీవోలను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఆబ్కారీశాఖలో 14 మంది ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లకు బదిలీ ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే పెద్ద ఎత్తున తహశీల్దార్లను ట్రాన్స్‌ఫర్‌ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహశీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్‌లు (ఆర్డీవో) లు బదిలీ అయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)