తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తనయుడు లోహిత్ రెడ్డి రిసెప్షన్ సుమారు 70 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ వేడుకకు పొంగులేటి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సుమారు రెండు లక్షలకు పైగా హాజరుకానున్నారని, వారికి పలు రకాల వంటకాలతో రుచికరమైన భోజన ఏర్పాట్లు, ఎటువంటి అసౌకర్యం కలగకుండా గత కొద్ది రోజుల నుంచి వారు అన్ని వసతులతో కూడిన ఏర్పాట్లను పూర్తి చేశారు. రాజకీయాలలో ఎంతో ప్రజాభిమానం సంపాదించిన పొంగలేటి కుటుంబంలో ఈ కార్యక్రమం జరగనుండడంతో రెండు ఉమ్మడి జిల్లాల నుంచి మాత్రమే కాక రాష్ట్ర నలుమూలల నుంచి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు రానున్నారు. రిసెప్షన్ వేదిక సింహద్వారం సినీ సెట్టింగ్ లతో ప్రజలను, చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
70 ఎకరాలలో పొంగులేటి వారి రిసెప్షన్ సెట్టింగ్ !
February 18, 2024
0
Tags