పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు !

Telugu Lo Computer
0


నసేన అధినేత పవన్ కల్యాణ్‌ వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై క్రిమినల్ కేసు పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిని విచారణకు స్వీకరించిన గుంటూరు జిల్లా ప్రధాన న్యాయస్థానం పవన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణను నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ జిల్లా ప్రధాన న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే జిల్లా నాలుగో అదనపు జిల్లా కోర్టు.. ఈ కేసుకు సంబంధించి మార్చి 25న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. గతేడాది జూలైలో పవన్ కల్యాణ్‌లో తన వారాహి యాత్రలో భాగంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం వాలంటీర్లతో సేకరిస్తున్న సమాచారం ఎక్కడికి వెళ్తుందని ప్రశ్నించారు. సమాచార సేకరణపై ప్రభుత్వ విధివిధానాలను ప్రశ్నించారు. వాలంటీర్లకు అధిపతి ఎవరని అడిగారు. వాలంటీర్లు ఏదైనా తప్పులు చేస్తే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో ఆడపిల్లలతో సహా ప్రతి ఒక్కరి సమాచారం సేకరిస్తున్నారని అన్నారు. ఇలా సేకరించిన సమాచారం అసాంఘిక, సంఘ విద్రోహ శక్తులకు చేరడం వల్లనే మానవ అక్రమ రవాణా పెరిగిపోయిందని చెప్పారు.డేటా సేకరణకు సంబంధించిన వ్యవహారంలో కొంతమంది వైసీపీ పెద్దల పాత్ర ఉందని కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పాయని పవన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని.. అందులో 14 వేల మందిని కాపాడామని పోలీసులు చెబుతున్నారని, కనిపించకుండా పోయిన మిగిలిన వారి సంగతి ఏమిటని పవన్ కళ్యాణ్‌ ప్రశ్నించారు. ఈ విషయంలో డీజీపీ కూడా ఎందుకు స్పందించడం లేదని అన్నారు. అయితే గతేడాది జులై 9న ఏలూరులో నిర్వహించిన జనసేన వారాహి యాత్రలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పవన్ క్రిమినల్ కేసు దాఖలుకు పిటిషన్ దాఖలు చేసింది. పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను ఇందులో ప్రస్తావించిన ప్రభుత్వం.. ఆయన వ్యాఖ్యలు వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా, ప్రభుత్వంపై బురదజల్లేలా ఉన్నాయని పేర్కొంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)