ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్లో ఉంటున్నఅభిషేక్ అహ్లూవాలీ, అంజలికి నవంబర్ 30వ తేదీన వివాహం జరిగింది. సోమవారం ఢిల్లీ జూ సందర్శనకు వెళ్లింది. అయితే అక్కడికి వెళ్లిన కాసేపటికే ఛాతీలో నొప్పి ఉందంటూ అభిషేక్ అంజలితో చెప్పాడు. ఆందోళనతో అంజలి అతని స్నేహితులకు వెంటనే సమాచారం ఇచ్చింది. వాళ్లు అతన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సఫ్దార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. కాసేపటికే అభిషేక్ కన్నుమూశాడని, అతని మృతికి గుండెపోటే కారణమని వైద్యులు తెలిపారు. పోస్ట్మార్టం తర్వాత అభిషేక్ మృతదేహాన్ని రాత్రి 9గం. సమయంలో ఆ జంట ఉంటున్న ఫ్లాట్కు తరలించారు. అందరూ శోకసంద్రంలో మునిగిపోగా అంజలి మాత్రం అక్కడి నుంచి బయటకు వెళ్లింది. బంధువులు అప్రమత్తమై ఆమెను అడ్డుకునేలోపే ఏడో అంతస్తుకు చేరి అక్కడి నుంచి దూకేసింది. తీవ్రంగా గాయపడిన అంజలిని వైశాలి ఏరియాలోని ఓ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూసింది. 24 గంటల వ్యవధిలో అభిషేక్, అంజలి దంపతుల మృతి చెందడంతో ఇరుకు టుంబాలలో విషాదం నెలకొంది.
24 గంటల్లో కొత్త జంట జీవితం విషాదాంతం !
February 27, 2024
0
Tags