తమిళనాడులోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది చనిపోయారని ప్రాధమిక సమాచారం. తమిళనాడు విరుదునగర్ సమీపంలోని ముత్తుసామి పురంలో విజయ్కు చెందిన బాణాసంచా ఫ్యాక్టరీ నడుస్తోంది. ఈ రోజు యధావిధిగా పనులు జరుగుతుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 30 మంది అక్కడ పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారని, వారిలో 7 మంది మృత దేహాలను గుర్తించామని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. క్రాకర్స్లో మందు కలిపే సమయంలో రాపిడి వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింది.
బాణసంచా ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదం లో 10 మంది మృతి !
February 17, 2024
0
Tags