వైద్యుడిపై చెప్పుతో దాడి చేసిన మహిళ !

Telugu Lo Computer
0


డిశాలోని పర్లాఖెముండి పట్టణంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు రష్మికాంత్‌ మిశ్రాపై ఓ మహిళ చేయి చేసుకున్న ఘటన మంగళవారం చర్చనీయాంశమైంది. రోగులను పరీక్షిస్తున్న సమయంలో మహిళ అక్కడికి చేరుకొని, ఏడాది కిందట తన కుమార్తె శవ పరీక్ష నివేదిక తప్పుగా ఇచ్చారని చెప్పుతో కొట్టినట్లు బాధిత వైద్యుడు వాపోయారు. చరవాణి లాక్కొని నేలకేసి కొట్టిందని వాపోయారు. దీనిపై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై జిల్లా అదనపు వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌ పండాను సంప్రదించగా ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని, వైద్య బృందంతో సమావేశం ఏర్పాటుచేసి చర్చించి, తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సదరు మహిళ గతేడాది మృతి చెందిన నవోదయ విద్యార్థిని సౌధామిని తల్లి సుజ్ఞాని గమాంగ్‌గా తెలిసింది. అప్పట్లో తన కుమార్తెను హతామార్చారంటూ ఈమె నిరసనకు దిగింది. కానీ పోస్టుమార్టం చేసిన రష్మికాంత్‌ మిశ్రా ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదిక ఇచ్చారు. దీంతో తప్పుగా నివేదిక ఇచ్చారన్న ఆగ్రహంతో డాక్టరుపై చేయిచేసుకుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)