ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరంలో 5,500 కేజీల భారీ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నారు. 44 అడుగుల పొడవుతో ఈ పవిత్ర ధ్వజస్తంభాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఓ కంపెనీ తయారు చేసింది. దీన్ని ప్రత్యేక రథంలో మంగళవారం అయోధ్యకు తీసుకొచ్చారు. శిల్ప శాస్త్రానికి తగ్గట్టు పూర్తిగా ఇత్తడితో దీన్ని తయారుచేశారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ధ్వజస్తంభంపై ప్రధాని నరేంద్ర మోదీ కాషాయ జెండా ఎగురవేయనున్నట్లు తెలుస్తున్నది.
రామమందిరానికి ఐదున్నర టన్నుల ఇత్తడి ధ్వజస్తంభం
January 10, 2024
0
Tags