భార్యపై అనుమానంతో భార్య, పిల్లలను గొంతు కోసి చంపిన కసాయి !

Telugu Lo Computer
0

త్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ హరి గ్రామంలో భార్యపై అనుమానంతో కసాయి భర్త తన భార్య, ముగ్గురు పిల్లలను గొంతుకోసి హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. భార్యకు అక్రమ సంబంధాలున్నాయని భర్త అనుమానిస్తున్నాడని, దీంతో భార్యాభర్తల మధ్య రోజూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ వివాదంపై కుటుంబ పెద్దలు కూడా ఒకటి రెండుసార్లు పంచాయతి పెట్టారు. ఈ విషయమై సోమవారం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. హత్యకేసుపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి భర్త పేరు ఉమేంద్ర కేవత్‌గా చెబుతున్నారు. భార్య, పిల్లలను హతమార్చిన భర్త తానూ ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)