దేశంలో కొత్తగా 475 కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో 475 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 3,919 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.కర్ణాటకలో ముగ్గురు, ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు, అస్సాంలో ఒకరు కొవిడ్‌ వల్ల మరణించారు. 12 రాష్ట్రాల నుంచి జనవరి 8వ తేదీ వరకు 819 జేఎన్‌-1 సబ్‌వేరియంట్‌ కేసులు నమోదయ్యాయని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. జేఎన్‌-1 సబ్‌వేరియంట్‌కు సంబంధించి మహారాష్ట్ర నుంచి 250 కేసులు నమోదు కాగా.. కర్ణాటక నుంచి 199, కేరళ నుంచి 148, గోవా నుంచి 49, గుజరాత్ నుంచి 36, ఆంధ్ర ప్రదేశ్ నుంచి 30, రాజస్థాన్ నుంచి 30, తమిళనాడు నుండి 26, తెలంగాణలో 26 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ నుంచి 21, ఒడిశా నుంచి ముగ్గురు, హర్యానా నుంచి ఒకరు ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)