పడవ బోల్తాపడి 14 మంది మృతి

Telugu Lo Computer
0


గుజరాత్ లోని హర్ని సరస్సులో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మంది మరణించారు. ప్రమాద సమయంలో పడవలో 27 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన 27 మంది విద్యార్థులు గురువారం విహారయాత్రకు వచ్చారు. మధ్యాహ్న సమయంలో హర్ని సరస్సులో ఓ పడవలో వెలుతుండగా వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 10 మందికి పైగా విద్యార్థులను కాపాడారు. గల్లంతైన మిగిలిన విద్యార్థుల గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మరణించిన 14 మందిలో 12 మంది విద్యార్థులు కాగా మరో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నట్లు గుజరాత్ రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే మంత్రి ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి బోటు కాంట్రాక్టర్ తప్పిదమే కారణమని అంటున్నారు. బోటులో కెపాసిటీ కంటే ఎక్కువ మంది పిల్లలను ఎక్కించారన్నారు. వారితో పాటు పలువురు ఉపాధ్యాయులు కూడా ఉన్నారన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)