ఆంధ్రప్రదేశ్ కు మరో తుఫాన్ ముప్పు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ కు మరో తుఫాన్ ముప్పు పొంచివుందని వాతావరణశాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. దీనివల్ల సముద్రం నుంచి తమిళనాడుతోపాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోసర్తు వర్షాలు కురుస్తాయని, రాష్ట్రంపైకి వీస్తున్న పొడిగాలులతో కోస్తా, రాయలసీమల్లో ఏజెన్సీ ప్రాంతం శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతుందని, రాత్రి ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయని వాతావరణశాఖ తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)