రోడ్డు ప్రమాదంలో వధూవరుల దుర్మరణం

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్ లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలో అతివేగంగా వచ్చిన ట్రక్కు, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొత్తగా పెళ్లైన జంట అక్కడికక్కడే మరణించారు. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత వధూవరులు, బంధువులతో కారు దట్టమైన పకారియా అడవి గుండా వెళ్తున్న క్రమంలో ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కారు పామ్‌గఢ్ నుంచి అకల్తారాకు వెళ్తోంది. విషయం తెలిసిన వెంటనే వైద్య సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుంది. ముల్ముల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జైంది. అతి కష్టం మీద పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను రాయ్‌గఢ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాద వార్త తెలియగానే ఇరు కుటుంబాల్లో సంతోషాలు ఆవిరయ్యాయి. అంతసేపు బంధుమిత్రులతో సందడిగా ఉన్న ఇళ్లు శోకసంద్రంగా మారిపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)