గుజరాత్లోని జీజీ ఆస్పత్రిలో ఓ రోగికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే అతను బీడీ వెలిగించడంతో ఆ బీడీ మంటలు మాస్కుకు అంటుకున్నాయి. అనంతరం అక్కడున్న బెడ్కు కూడా వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాలిన గాయాలతో బాధపడుతున్న ఆ రోగిని మరో వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. బాధిత రోగి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని తెలిసింది. స్మోకింగ్కు అలవాటు పడ్డ అతను.. డాక్టర్లు, నర్సులు లేని సమయంలో బీడీ వెలిగించాడు. అతని బెడ్ పక్కన సగం కాలిన అగ్గిపుల్ల, అగ్గిపెట్టె కనిపించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఐసీయూలో బీడీ కాల్చిన రోగి !
December 22, 2023
0
Tags