కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయని శివసేన (యూబీటీ), ఇండియా కూటమి నేత సంజయ్ రౌత్ అన్నారు. ఈ విషయం చెప్పడానికి ఏ ఎగ్జిట్ పోల్ అవసరం లేదన్నారు. ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ గురువారంతో ముగిసింది. అనంతరం వెలువడిన పలు సర్వే అంచనాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్లో పరిస్థితి కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో భాజపా, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉండనుందని అంచనా వేశాయి. మిజోరంలో ప్రాంతీయ పార్టీల మధ్యే పోరు ఉండనుందని తెలిపాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడైన నేపథ్యంలో సంజయ్ రౌత్ మాట్లాడారు. ''కాంగ్రెస్ గెలుపు అంటే అది ఇండియా కూటమి విజయం. నేను దాన్ని బలంగా నమ్ముతా. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపొందితే విపక్షాల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తుంది. దీనిని కూటమి విజయంగా చూడాలి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే నాయకత్వమే దీనంతటికీ కారణం'' అని సంజయ్ రౌత్ అన్నారు.
Post a Comment
0Comments
3/related/default