రాజస్థాన్లో మొదటిసారి గెలిచిన భజన్లాల్ శర్మను సీఎంగా, ప్రేమ్ చంద్ భైరవ, దియా కుమారిలను డిప్యూటీ సీఎం పదవులుగా బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. సామాజిక సమీకరణాల దృష్ట్యా రాజస్థాన్లో రాజ కుంటుబానికి చెందిన దియా కుమారికి.. డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఈసారీ బీజేపీ హైకమాండ్ రాజస్థాన్ సీఎంగా దియా కుమారికి అవకాశం కల్పిస్తారని పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది. సీఎం పదవి కోసం వసుంధర రాజే, అర్జున్రామ్, గజేంద్ర షెకావత్, అశ్విని వైష్ణవ్ వంటి సీనియర్ నేతలతో పోటీపడ్డ దియా కుమారి డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకుంది.
రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా దియాకుమారి, ప్రేమ్ చంద్ భైరవ !
December 12, 2023
0
Tags