అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి కాన్వాయ్‌ను రోడ్డు పక్కకి మళ్లించిన మోడీ !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని వారణాసిలో ఈరోజు అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి ప్రధాని నరేంద్ర మోడీ తన కాన్వాయ్‌ను రోడ్డు పక్కకి మళ్లించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై నెట్టింట హర్షం వ్యక్తమవుతోంది. ప్రధాని మోడీ అంబులెన్స్‌కు దారి ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది అహ్మదాబాద్‌, హిమాచల్‌ప్రదేశ్‌ పర్యటనలోనూ ప్రధాని తన కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో ఉన్నారు. అదివారం తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రోడ్‌ షోలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సమయంలో అటువైపుగా అంబులెన్స్‌ రావడంను మోడీ గుర్తించారు. ఆ అంబులెన్స్‌కు మార్గం కల్పించేందుకు తన కాన్వాయ్‌ను రోడ్డు పక్కకి మళ్లించాలని భద్రతా అధికారులకు సూచించారు. వెంటనే సిబ్బంది అంబులెన్స్‌కు మార్గం సుగమం చేయడంతో అంబులెన్స్ ఎలాంటి ఆటకం లేకుండా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)