మసాలా దోశ 600 రూపాయలు !

Telugu Lo Computer
0


ఆరు వందల రూపాయల మసాలా దోశ తినాలనుంటే ముంబై విమానాశ్రయానికి వెళ్లాలి. ఎందుకంటే ఇంత ఖరీదైన దోశ అక్కడే దొరుకుతుంది మరి. రేటు ఎక్కువుంది కదా ఇందులో స్పెషల్ ఏమైనా ఉంటుందని అనుకుంటున్నారేమో. అలాంటిది ఏమీ లేదు. అందుకే మామూలు మసాలా దోశ. ఇంత రేటా అని జనం అవాక్కవుతున్నారు. షెఫ్ డాన్ ఇండియా అనే ఐడీతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ దోశ వీడియో షేర్ చేశారు. ముంబై ఎయిర్‌పోర్టులో దోశ కంటే బంగారం చావక అనే క్యాప్షన్ కూడా పెట్టారు. ఇది చూసి నెటిజనులు సైటర్లు పేలుస్తున్నారు. 'ఈ మసాలా దోశ గురించి తెలుసుకుని సౌతిండియన్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. బహుశా ఈ దోశ వేయడానికి ఎల్పీజీ, సీఎన్జీ కాకుండా టర్బైన్ ఫ్యూయల్ వాడుంటారు. వెండి రేటు సమానంగా ఈ దోశ ధర ఉంది. మా ఊర్లో దోశ 40 రూపాయలే. 2 గంటల పాటు ఆకలితో నకనకలాడినా ముంబై ఎయిర్‌పోర్టులో దోశ మాత్రం తినలేదు' అంటూ నెటిజనులు కామెంట్లు పెట్టారు. ఒకరిద్దరూ మాత్రం ఎయిర్‌పోర్టులో వసూలు చేసే దుకాణం అద్దె ఎంతో తెలుసుకోవాలని, బహుశా దానికి అనుగుణంగానే ధరలు పెట్టివుంటారని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ముంబై ఎయిర్‌పోర్టులో దోశ రేటు మాత్రం వైరల్‌గా మారిపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)