పదోసారి మంత్రి బాలాజీ రిమాండ్‌ పొడిగింపు !

Telugu Lo Computer
0


మిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీ రిమాండ్‌ను చెన్నై ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టు పదోసారి పొడిగించింది. చట్టవ్యతిరేక నగదు పరివర్తన చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం గత నెల జూన్‌ 14వ తేది అరెస్ట్‌ చేసిన మంత్రి సెంథిల్‌ బాలాజి పుళల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసు విచారణ చెన్నై ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టులో సాగుతోంది. బాలాజి రిమాండ్‌ సోమవారంతో ముగియగా, ఆయన రిమాండ్‌ను ఈ నెల 22వ తేది వరకు కోర్టు పొడిగించింది. ఈ నేపథ్యంలో, కోర్టులో దాఖలుచేయని దస్తావేజులు అందించాలని కోరుతూ సెంథిల్‌ బాలాజి తరఫున పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై అఫిడివిట్‌ దాఖలు చేయాలని ఎన్‌ఫోన్స్‌మెంట్‌ విభాగానికి న్యాయమూర్తి అల్లి ఉత్తర్వులు జారీ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)