నవీ ముంబయిలో ఒక పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ హాజరయ్యారు. సరిగ్గా శరద్ పవార్ ప్రసంగించే సమయంలో ఒక్కసారిగా వర్షం కురిసింది. అలాంటి సమయంలో 82 ఏళ్ల వయసున్న శరద్ పవార్ తన ప్రసంగాన్ని ఆపేసి, సురక్షిత ప్రదేశానికి తరలి వెళ్తారని అంతా భావించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా ఆయన వర్షంలో తడుస్తూనే ప్రసంగించారు. అక్కడ తడుస్తున్న ప్రజల్లోనూ జోష్ నింపారు. "ఈ వర్షం కురవడం వల్ల మా ప్రణాళికలు దెబ్బతిన్నాయి. కానీ మేము అంత తేలిగ్గా లొంగం, వెనకడుగు వేయం. భవిష్యత్తులో కూడా మన పోరాటాన్ని కొనసాగించాలి" అంటూ శరద్ పవార్ చెప్పుకొచ్చారు. ఎన్సీపీ పార్టీపై నియంత్రణ సాధించేందుకు తన మేనల్లుడు అజిత్ పవార్ ఎన్నో ప్రయత్నాలు చేశాడని కూడా తన ప్రసంగంలో ఆయన వివరించారు. ఏదేమైనా.. వర్షంలో తడుస్తూ శరద్ పవార్ ఇచ్చిన ఈ ప్రసంగానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్షాన్ని లెక్క చేయకుండా ఆయన ప్రసంగం ఇవ్వడంపై పలువురు ప్రశంసిస్తున్నారు.
వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శరద్ పవార్ ప్రసంగం !
November 27, 2023
0
Tags