బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇది భారత్, బంగ్లాదేశ్, మయన్మార్ లను తాకే అవకాశం ఉందని స్కైమెట్ వెదర్ సూచిస్తోంది. రాబోయే ఉష్ణ మండల తుపాను మూలాన్ని గల్ఫ్ ఆప్ థాయ్ లాండ్ లో గుర్తించవచ్చు. నవంబర్ 25 లేదా ఆ తర్వాత భూమధ్యరేఖ ద్వారా అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, భారతదేశం, బంగ్లాదేశ్ , మయన్మార్ తీరప్రాంతంలో ల్యాండ్ఫాల్ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ తుపాను వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లలో ప్రమాదకర వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. అయితే ఈ తుపాను ఈ ప్రాంతాలను తాకుతుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. బంగాళాఖాతంలో ఈ ఏడాది సంభవించే 4వ తుపానును మిచాంగ్ అని లేదా మిగ్జామ్ అని పిలుస్తారు.
బంగాళాఖాతంలో మరో తుఫాన్ ?
November 22, 2023
0
Tags