బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాదుండగులను తరిమికొట్టిన మహిళ !

Telugu Lo Computer
0


ర్యానాలోని భివానీలో డాబర్ కాలనీలో ఓ వ్యక్తి ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. అదే సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై ఐదుగురు దుండగులు అక్కడి వచ్చారు. వెనక కూర్చున్న ఇద్దరు వ్యక్తులు వాహనం దిగుతూనే ఇంటి ముందు నిలబడి ఉన్న వ్యక్తిపై తుపాకితో కాల్పులు జరిపారు. దీంతో అతడు భయపడి ఇంట్లోకి వెళ్లి తప్పించుకున్నాడు. అదే సమయంలో ఓ మహిళా ఎదురు ఇంటి నుంచి వచ్చింది. ఆ వ్యక్తి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా తుపాకులను సైతం ఏమాత్రం లెక్క చేయలేదు. ఓ పెద్ద కర్రతో దుండగులపై ఎదురు దాడికి ప్రయత్నించింది. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో ఆ మహిళపై కూడా కాల్పులు జరిపారు. కానీ ఆమె తప్పించుకుంది. ముష్కరులు తొమ్మిది రౌండ్లు కాల్పులు జరపగా, ఆ వ్యక్తి నాలుగు బుల్లెట్లతో గాయపడ్డారు. దీంతో అతడిని ఆస్పత్రి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.  ఆ మహిళ ధైర్యానికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. తుపాకులను సైతం లెక్క చేయని ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్నారు. అయితే ఘటనలో గాయపడిన వ్యక్తి ఇటీవల దారుణ హత్యకు గురైన రవి బాక్సార్ హత్య కేసులో నిందితుడుగా ఉన్న హరికిషన్. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా జైలుకు వెళ్లిన హరికిషన్ ఇటీవలె బెయిల్‌పై బయటకు వచ్చాడు. అతడు గ్యాంగ్‌స్టర్ భవ్య బిష్ణోయ్‌తో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. అతడిపై దాడికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్న ఐదుగురిని మూడు నెలల క్రితం భివానీ పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)