భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఒడిశాలోని బాదంపహార్ రైల్వే స్టేషన్ నుండి మూడు కొత్త మెము రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. బాదంపహార్ – టాటానగర్, బాదంపహార్ – రూర్కెలా వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుతో పాటు బాదంపహార్ – షాలిమార్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అదే విధంగా ఆమె కొత్త రాయంగ్పూర్ పోస్టల్ డివిజన్ను కూడా వర్చువల్ గా ప్రారంభించారు . దీంతోపాటు రాయంగ్పూర్ పోస్టల్ డివిజన్ యొక్క స్మారక ప్రత్యేక కవర్ విడుదల చేసారు . ఈ సందర్భంగా బాదంపహార్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ.. ఏ ప్రాంతమైనా అభివృద్ధి అనేది ఆ ప్రాంతం కనెక్టివిటీపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అది రైలు, రోడ్లు లేదా తపాలా సేవలు ఇలా ఏవైనా కావొచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ సేవలన్నీ ప్రజల జీవితాలను మరింత సులభతరం చేస్తాయన్నారు . మంగళవారం ప్రారంభించిన ఈ మూడు రైళ్లు జార్ఖండ్ , పశ్చిమ బెంగాల్ వంటి పొరుగు రాష్ట్రాలకు ప్రయాణించడానికి స్థానికులకు ఎంతో సహాయపడతాయని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఒడిశాలోని పారిశ్రామిక పట్టణం రూర్కెలాను సందర్శించడంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగదని ఆమె తెలిపారు. సెల్ ఫోన్లు , కొరియర్ సేవల ట్రెండ్ పెరుగుతున్నప్పటికీ ఇండియా పోస్ట్ తన ఔచిత్యాన్ని కోల్పోలేదని రాష్ట్రపతి అన్నారు. రాయంగ్పూర్ లో కొత్త పోస్టల్ డివిజన్ ప్రారంభోత్సవం ఈ ప్రాంతానికి ఒక ముఖ్యమైన కార్యక్రమని , ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడు తపాలా సేవలను సులభంగా పొందగలుగుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. గిరిజనుల అభివృద్ధి లేకుండా సమ్మిళిత అభివృద్ధి అసంపూర్ణమని అన్నారు. అందుకే గిరిజన సంఘాల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందన్నారు . గిరిజన యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వీయ అభివృద్ధి కి సొంత ప్రయత్నం కూడా అవసరమని ఉద్ఘాటించారు. యువత తమ జీవితంలో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలి రాష్ట్రపతి అన్నారు . పివిటిజిల అభివృద్ధికి ప్రభుత్వం ఈ ఏడాది జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా పిఎం జన్మన్ను ప్రారంభించిందని రాష్ట్రపతి తెలిపారు. గిరిజనుల ప్రగతికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆమె పేర్కొన్నారు. ఈ అమృత్కాల్ కార్యక్రమం ప్రజలను అభివృద్ధితో అనుసంధానం చేస్తుందని అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క లక్ష్యాన్ని సాధించడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం రాష్ట్రపతి ముర్ము బాదంపహార్ – షాలిమార్ ఎక్స్ప్రెస్ రైలులో బదంపహార్ నుండి రాయిరంగపు వరకు ప్రయాణించారు.
Post Top Ad
adg
Tuesday 21 November 2023
Home
indian railways
National
Odisha
బాదంపహార్ – టాటానగర్
బాదంపహార్ – రూర్కెలా వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుతో పాటు బాదంపహార్ – షాలిమార్ వీక్లీ ఎక్స్ప్రెస్
బాదంపహార్ నుండి మూడు కొత్త రైళ్లు
బాదంపహార్ నుండి మూడు కొత్త రైళ్లు !
బాదంపహార్ నుండి మూడు కొత్త రైళ్లు !
Tags
# indian railways
# National
# Odisha
# బాదంపహార్ – టాటానగర్
# బాదంపహార్ – రూర్కెలా వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుతో పాటు బాదంపహార్ – షాలిమార్ వీక్లీ ఎక్స్ప్రెస్
# బాదంపహార్ నుండి మూడు కొత్త రైళ్లు
About Telugu Lo Computer
బాదంపహార్ నుండి మూడు కొత్త రైళ్లు
Tags
indian railways,
National,
Odisha,
బాదంపహార్ – టాటానగర్,
బాదంపహార్ – రూర్కెలా వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుతో పాటు బాదంపహార్ – షాలిమార్ వీక్లీ ఎక్స్ప్రెస్,
బాదంపహార్ నుండి మూడు కొత్త రైళ్లు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment