డిజిటల్ పేమెంట్స్ లో కీలకంగా మారిన యూపీఐ పేమెంట్స్ మరింత ఈజీ కానున్నాయి. అందుకోసం భారతీయ రిజర్వు బ్యాంక్ పలు చర్యలు తీసుకుంటోంది. ఇంతకు ముందే వాయిస్ కమాండ్ ఆధారిత పేమెంట్స్ ప్రారంభిస్తామని ఆర్బీఐ ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 'వాయిస్ ఆధారిత యూపీఐ పేమెంట్స్' విధానం అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఈ విషయమై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. 'హలో! యూపీఐ' ఫీచర్ వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా మొబైల్ యాప్స్ ల్లో అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని చెప్పింది.
త్వరలో వాయిస్తో యూపీఐ పేమెంట్స్ !
November 02, 2023
0
Tags