కాంగ్రెస్‌ సమావేశంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ !

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని  నాగ్‌పూర్ డివిజన్ పరిధిలోని లోక్‌సభ స్థానాలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సమావేశం జరిగింది. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు విజయ్ వాడెట్టివార్, మాజీ ఎంపీ విలాస్ ముత్తెంవార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, నాగ్‌పూర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వికాస్‌ ఠాక్రే, ఆ పార్టీ నాయకుడు నరేంద్ర జిచ్‌కర్‌ ఈ సందర్భంగా మైక్‌ కోసం గొడవపడ్డారు. తొలుత మాట్లాడేందుకు వారిద్దరూ పోటీ పడ్డారు. దీంతో ఇరు వర్గాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. మరోవైపు ఇటీవల రాహుల్ గాంధీపై వడెట్టివార్ చేసిన వ్యాఖ్యలపై కొందరు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వేదికపైకి రాగానే ఇరు వర్గాలు వాగ్వాదానికి, ఘర్షణకు దిగాయి. శాంతి వహించాలని పటోలే పదే పదే కోరినప్పటికీ సుమారు అరగంట వరకు కోట్లాట కొనసాగింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)