ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా !

Telugu Lo Computer
0

                                                   

తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సోమవారం ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో 579 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నట్లు ఆయన ప్రకటించారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనావళి అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు.

రాజస్థాన్‌ : ఎన్నికల నోటిఫికేషన్: అక్టోబర్ 21, నామినేషన్ల గడువు తేదీ: అక్టోబర్ 31, నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 31,  నామినేషన్ల ఉపసంహరణ గడువు తేదీ: నవంబర్ 2, పోలింగ్: నవంబర్ 17, కౌంటింగ్: డిసెంబర్ 3. 

మధ్యప్రదేశ్‌ : ఎన్నికల నోటిఫికేషన్: అక్టోబర్ 13, నామినేషన్ల గడవు తేదీ: అక్టోబర్ 20, నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 21, పోలింగ్: నవంబర్ 7, కౌంటింగ్: డిసెంబర్ 3.

మిజోరం : ఎన్నికల నోటిఫికేషన్: అక్టోబర్ 13, నామినేషన్ల గడువు: అక్టోబర్ 20, నామినేషన్ల పరిశీలన: అక్టబోర్ 21, నామినేషన్ల ఉపసంహరణ గడువు: అక్టబోర్ 23, పోలింగ్: నవంబర్ 7, కౌంటింగ్: డిసెంబర్ 3.

ఛత్తీస్‌గఢ్(రెండు దశలు): ఎన్నికల నోటిఫికేషన్: అక్టోబర్ 3, నామినేషన్ల గడువు: అక్టోబర్ 20, అక్టోబర్ 30 (రెండవదశ). నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 21, అక్టోబర్ 31(రెండవ దశ) నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 23, నవంబర్ 2 (రెండవ దశ), పోలింగ్: నవంబర్ 7 (మొదటి దశ), నవంబర్ 17 (రెండవ దశ), కౌంటింగ్: డిసెంబర్ 3

తెలంగాణ : నోటిఫికేషన్ విడుదల: నవంబర్ 3, నామినేషన్ల గడువు తేదీ: నవంబర్ 10, నామినేషన్ల పరిశీలన: నవంబర్ 13, నామినేషన్ల ఉపసంహరణ గడువు తేదీ: నవంబర్ 15, పోలింగ్ తేదీ: నవంబర్ 30.

కౌంటింగ్: డిసెంబర్ 3. ఎన్నికల ప్రక్రియ ముగింపు: డిసెంబర్ 5.

Post a Comment

0Comments

Post a Comment (0)