కైరోలో శాంతి శిఖరాగ్ర సమావేశం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 21 October 2023

కైరోలో శాంతి శిఖరాగ్ర సమావేశం !

జ్రాయిల్‌కు సన్నిహిత దేశాల్లో ఒకటైన ఈజిప్ట్ ఇరుదేశాల మధ్య శాంతి సమావేశానికి పిలుపు నిచ్చింది. విదేశీ నేతలు సమావేశం అవ్వడానికి కైరోలో వేదిక సిద్ధమైంది. గాజాలో ఇజ్రాయిల్, పాలస్తీనా కు చెందిన హమాస్ లకు మధ్య పెరుగుతున్న సంక్షోభాన్ని చర్చించడం కైరో శాంతి శిఖరాగ్ర సమావేశ ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఈ సదస్సులో అమెరికా, ఇజ్రాయిల్ లతో పాటు మరికొన్ని దేశాల అధినేతలు పాల్గొనలేదు. శాంతి సదస్సుకు తమ ప్రతినిధులను పంపిన అరబ్‌యేతర దేశాల్లో చైనా, రష్యా, జపాన్‌లు ఉన్నాయి. అనేక అరబ్, యూరోపియన్ దేశాధినేతలతో పాటు ప్రభుత్వాధినేతలు, అలాగే అనేక దేశాల విదేశాంగ మంత్రులు పాలస్తీనా భవిష్యత్తు గురించి చర్చించడానికి హాజరయ్యారు. ఇరుదేశాల మధ్య ఐక్యతను పెంపొందించడం, సంఘర్షణకు శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడం ఈ శిఖరాగ్ర సమావేశ ప్రధాన లక్ష్యం. అక్టోబరు 7న ఇజ్రాయిల్ పై హమాస్ చేసిన దాడిలో వందలాది మంది మరణించిన తర్వాత ఇజ్రాయిల్ గాజాపై భూదాడికి సిద్ధమయింది. ఇజ్రాయిల్ ఎదురుదాడిలో 4,100 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో మానవతా సంక్షోభం పెరిగింది. 23 లక్షల జనాభా ఉన్న గాజాపై ఇజ్రాయిల్ బాంబు దాడులు చేస్తూ ముట్టడి చేయడంపై అరబ్ దేశాలు అసహనం వ్యక్తం చేశాయి. ఐరోపా దేశాలు ఐక్యతను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే హమాస్‌పై యూరోపియన్ దేశాలు తీవ్ర విమర్శలు చేశాయి. మరోవైపు రాఫా క్రాసింగ్ ద్వారా గాజాకు మానవతా సహాయాన్ని పంపడానికి ఈజిప్ట్ ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్ నిరంతరం బాంబు దాడి చేస్తోంది. సినాయ్‌లోని పాలస్తీనియన్లను తరలించే ప్రయత్నాన్ని లక్షలాది మంది ఈజిప్షియన్లు తిరస్కరించారని, సాధ్యమైనంత అన్ని విధాలుగా సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్-సి సి చెప్పారు.


No comments:

Post a Comment