తెలంగాణలో 52 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల

Telugu Lo Computer
0

తెలంగాణలో 52 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆదివారం బీజేపీ హైకమాండ్ విడుదల చేసింది. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎంపీ అర్వింద్ వంటి అగ్రనేతలందరి పేర్లు ఫస్ట్ లిస్ట్‌లోనే ప్రకటించారు. ఈటల రాజేందర్ హుజురాబాద్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తోన్న గజ్వేల్ నియోజకవర్గం నుంచీ ఈటల బరిలోకి దిగారు. దీంతో ఈసారి ఈటల రెండు చోట్ల పోటీ చేయడం ఖరారైంది. కాగా, మొదటి లిస్టులో పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, విజయశాంతి, డీకే అరుణ పేర్లు లేకపోవడం గమనార్హం. ఇప్పటికే బీఆర్ఎస్‌ 119 నియోజకవర్గాల అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారం ప్రారంభించింది. కాంగ్రెస్ 55 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. ఆ 55 మంది అభ్యర్థులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక ఇవాళ బీజేపీ సైతం 52 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేయడంతో రాజకీయం రంజుగా మారింది. రేపటి నుంచి రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం ఊపందుకోనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)