చట్టం తమదేనని ప్రజలు భావించాలి !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు జరుగుతుంది. 'ఎమర్జింగ్‌ ఛాలెంజెస్‌ ఇన్‌ జస్టిస్‌ డెలివరీ సిస్టమ్‌' అనే అంశంపై బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఈ సదస్సును నిర్వహిస్తోంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో శనివారం ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ 'న్యాయవ్యవస్థ, బార్‌లు భారతదేశ న్యాయవ్యవస్థకు సంరక్షకులుగా ఉన్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారు. ప్రజల ప్రయోజనాల కోసం న్యాయవాద వృత్తిలో భాష సరళతపై దృష్టి పెట్టాలి. ప్రధానంగా దేశ పౌరులు చట్టం తమదేనని భావించాలి.' అని అన్నారు. అలాగే అభివృద్ధి చెందిన దేశం లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశంలోని న్యాయవ్యవస్థకు బలమైన, స్వతంత్ర మరియు నిష్పాక్షికమైన పునాదులు అవసరం అని మోడీ అన్నారు. సరళమైన భాషలో కొత్త చట్టాలను రూపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దీనికి డేటా ప్రొటెక్షన్‌ చట్టాన్ని మోడీ ఉదాహరణగా చెప్పారు. ఏదైనా చట్టం రెండు భాషల్లో ఉండాలి. ఒకటి న్యాయవ్యవస్థ తగ్గట్టుగా,  ఇంకొకటి సామాన్య పౌరులకు అర్థమయ్యేవిధంగా ఉండాలి అని మోడీ అన్నారు. ప్రస్తుతం హిందీ, తమిళం, గుజరాతీ, ఒడియా అనే నాలుగు భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులను అనువదించేందుకు కృషి చేసినందుకు మోడీ అభినందించారు. ఈ సదస్సులో ప్రధాని మోడీతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్‌ పాల్గొన్నారు. ఈ సదస్సులో డివై చంద్రచూడ్‌ మాట్లాడుతూ.. 'న్యాయవ్యవస్థలోని వ్యక్తులు వివిధ అధికార పరిధి, దృక్కోణాల నుండి ఒకరి నుండి మరొకరు నేర్చుకోవచ్చు. ఈ రెండు రోజుల సదస్సుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు వివిధ హైకోర్టుల నుండి నా సహచరులు, గ్లోబల్‌ ప్రాక్టీషనర్లు, న్యాయ పండితులు పాల్గొంటున్నారు.' అని అన్నారు. జస్టిస్‌ డెలివరీలో ఎలాంటి సవాళ్లు ఉండవు. కానీ మనం జస్టిస్‌ డెలివరీలో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారాలను కనుక్కోవాలి. అలాంటి పరిష్కారాలను కనుగొనేరోజు వస్తుందని భావిస్తున్నాను. ఏదేమైనా దేశాలు, సంస్థలు ముఖ్యంగా వ్యక్తులు, ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండటానికి సిద్ధంగా ఉన్న ప్రపంచంలో సాధ్యం కానిది లేదు అని ఆయన అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)