అసోంలోని జోరాబత్ ఏరియాలో గువహటి పోలీసుల విస్తృత తనిఖీల్లో 2.5 కిలోల హెరాయిన్ పట్టుబడింది. మొత్తం 198 సబ్సు బాక్సుల్లో హెరాయిన్ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ పట్టుబడ్డ హెరాయిన్ విలువ రూ. 21 కోట్లు ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. హెరాయిన్ను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు మణిపూర్కు చెందిన మహ్మద్ అమీర్ ఖాన్, మహ్మద్ యాకుప్, మహ్మద్ జమీర్ అని పేర్కొన్నారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రూ. 21 కోట్ల విలువ చేసే హెరాయిన్ పట్టివేత
September 11, 2023
0
Tags