ఐఫోన్-15 డెలివరీ లేట్ అయిందని షాప్ వారిని కొట్టారు !

Telugu Lo Computer
0


ఢిల్లీలో శనివారం ఐఫోన్-15 డెలివరీ ఆసల్యం అయిందంటూ ఒక మొబైల్ షాపులోని వర్కర్లను కొందరు కస్టమర్లు చితక్కొట్టారు. దాడికి సంబంధించిన దృశ్యాలు షాపులో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. నిందితుల్ని పట్టుకుని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వీడియో ప్రకారం ఢిల్లీలోని కమలా నగర్ లో ఉన్న ఒక మొబైల్ షాపులోకి వచ్చిన కస్టమర్లు ముందు అక్కడ పని చేస్తున్న వర్కర్లతో గొడవ పడ్డారు. మాటా మాటా పెరిగి వర్కర్లను విపరీతంగా కొట్టారు. ఒక వ్యక్తి చొక్కా తీసి మరీ కొట్టడం ఆందోళన కలిగిస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)