దేశ ప్రజలను మభ్యపెట్టేందుకే అవిశ్వాసం !

Telugu Lo Computer
0


దేశ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నిస్తున్నారని ప్రజల ఆకాంక్షల మేరకు అవిశ్వాసం తీసుకురాలేదని కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు. అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాధారణంగా ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోతే, ప్రజా ఆందోళనలు జరిగితే విపక్షాలు అవిశ్వాసం పెడతాయి. ప్రధాని, మంత్రుల తరఫున ఎవరికీ అవిశ్వాసం లేదు. ప్రజల్లో లేదు. సభలోనూ అవిశ్వాసం లేదు. ఇలాంటి సమయంలో విపక్ష సభ్యులు అవిశ్వాసం తీసుకొచ్చారు. పలు ప్రాంతాల ప్రజలను కలిసినప్పుడు ప్రభుత్వంపై కొంచెం కూడా అవిశ్వాసం లేదు. ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది అని అమిత్‌ షా తెలిపారు. పార్లమెంట్ లో మణిపూర్ మంటలు చెలరేగాయి. లోక్ సభలోకి అడుగుపెడుతూనే రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. దాదాపు నెల రోజుల నుంచి మణిపూర్ అంశం దేశాన్ని కుదిపేస్తోంది. మణిపూర్ పై పార్లమెంట్లో చర్చ జరగాలని.. ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని విపక్షాలు పట్టుబట్టాయి. కానీ ప్రధాని నుంచి మౌనమే సమాధానం ఎదురైంది. దీంతో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని అస్త్రంగా ఎంచుకున్నాయి. దానిపైనే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో చర్చ ప్రారంభమైంది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ రీ ఎంట్రీ ఇచ్చారు. సూటిగా, సుత్తి లేకుండా కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)